AP రైతులకు శుభవార్త వీళ్ళకు మాత్రమే 7వేలు జమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. రైతులకు ఒకేసారి రెండు పథకాలు అమలు చేయాలని నిర్ణయించాయి. అటు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతోపాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుంది. ఈ రెండు పథకాలు కలిపి రైతుల ఖాతాలో మెుత్తం రూ 20 వేలు జమకానున్నాయి. వీటిలో రూ.6వేలు కేంద్ర ప్రభుత్వం…..14 వేలు రాష్ట్రప్రభుత్వం అందించనుంది. ఈ రూ20 వేలు కూడా మూడు విడతలుగా జమకానున్న సంగతి తెలిసిందే. ఈ పథకం త్వరలోనే అమలు కానుంది. అయితే ఈ పథకం అమలులో భాగంగా బిగ్ అప్డేట్ వచ్చింది. 98శాతం ఈ కేవైసీ పూర్తైంది. ఇక రెండు శాతం మాత్రమే ఈ కేవైసీ అవ్వాల్సి ఉంది. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్ భూములు, ఇనాం భూములు కలిగిన రైతులు కూడా పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.
అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు రావాలంటే ఇలా చేయండి
Also Read
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకంను అమలుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పథకం అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అర్హత గల రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది. సాగు భూమి కలిగి ఉన్న రైతు కుటుంబాలకు మరియు అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వపు పీఎం కిసాన్ పథకం ద్వారా అందించే రూ.6,000/- ఆర్థిక సహాయంను కలుపుకుని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ 14000 /- అందిస్తూ మొత్తంగా రూ.20,000/- ఆర్థిక సహాయం రైతులకు అందించబడుతున్న సంగతి తెలిసిందే. అర్హులైన భూమిలేని సాగుదారులందరికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపు నుండి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అందించబడుతుంది.
అర్హులను ఎలా గుర్తించారు :
రెవిన్యూ వెబ్ల్యాండ్లో భూయజమానుల డేటా ఈ సమాచారాన్ని “అన్నదాత సుఖీభవ” పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో వెరిఫికేషన్ చేసి రాష్ట్రస్థాయిలో ధృవీకరించగా 47.77 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించిన సంగతి తెలిసిందే. వీరి వివరాలు e-KYC ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు పంపగా ఇప్పటివరకు 98% e-KYC పూర్తయింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 61,000 మందికి e-KYC చేయాల్సి ఉంది. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్ భూములు, ఇనాం భూములు కలిగిన రైతులు కూడా పథకానికి అర్హులు.
మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు అకౌంటు లింక్ అయిందో ఇలా చూసుకోండి
అర్హుల జాబితాలో పేరు లేని వారి కోసం ఏం చేయాలి ?
ఈ ప్రక్రియలో భాగంగా ధృవీకరణ రాని రైతులు స్థానిక రెవిన్యూ అధికారిని సంప్రదించుకుని భూ సమస్యలు ,ఆధార్ జత కాకపోవడం, ఆధార్ తప్పుగా జత అవ్వటం , చనిపోయిన ఖాతాలు, నోషనల్ ఖాతాలు మొదలగునవి పరిష్కరించూకోవాలని ప్రభుత్వం సూచించింది. తద్వారా వీరు కూడా పథకానికి నమోదు చేసుకోవచ్చు. వీరి కోసం గ్రీవెన్స్ మోడ్యూల్ త్వరలో అందుబాటులోకి వస్తుంది.
కౌలు రైతులు లబ్ధి పొందాలంటే :
1. కౌలు గుర్తింపు కార్డు పొందాలి
2. ఇ-పంట లో నమోదవ్వాలి
అర్హతల ప్రకారం వీరికి కూడా లబ్ధి అందించబడుతుంది. కౌలు రైతులకు మొత్తం లబ్ధి గతంలో మాదిరిగానే రెండు విడతలుగా అక్టోబర్, జనవరిలో అందించబడుతుంది.
ఇలా చెక్ చేసుకోవచ్చు
వైసీపీ ప్రభుత్వం డీ పట్టా, ఆర్ఒఎఫ్ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింపజేసింది. అయితే కూటమి ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ పథకానికి కూడా అవే వర్తింపజేస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారుల రైతు సేవా కేంద్రాలకు(ఆర్ఎస్కే) ఇప్పటికే పంపించినట్లు తెలుస్తోంది. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయ్యింది. వివరాలు లేనివారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలో రైతులు తమ ఆధార్ నంబర్ నమోదు చేసి పక్కనే ఉండా కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. సెర్చ్ చేసిన తర్వాత ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో…లేదో కూడా తెలుస్తుంది. జాబితాలో పేరు లేకుంటే రైతు సేవా కేంద్రంలో రైతులు సంప్రదించాల్సి ఉంది.
Nirudyogi Bruthi Apply Online 2025
డబ్బు ఖాతాలో పడిందో లేదో చెక్ చేసుకోండిలా
తొలుత పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి
కుడి వైపు ఆప్షన్లలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది
సెలక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ లేదా ఖాతా నంబర్ నమోదు చేసి‘గెట్ డేటా’పై క్లిక్ చేయాలి
అయితే స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకుని…ఈ-కేవైసీ పూర్తైతే నగదు జమ అవుతుంది. అంతేకాదు లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.
ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే మరొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. రాష్ట్రం..జిల్లా…ఉప జిల్లా….బ్లాక్ ఎంచుకుని గెట్ రిపోర్ట్పై క్లిక్ చేస్తే చాలు జాబితా, లబ్ధిదారుల పేర్లు కనిపిస్తాయి.